29.7 C
Hyderabad
April 29, 2024 09: 58 AM
Slider విజయనగరం

మీరు…పోర్ట్ ఎస్టేట్…. మీ స‌హాకారం ఎంతో అవ‌స‌రం..!

#vijayanagaram collector

విజ‌య‌న‌గ‌రం  జిల్లా క‌లెక్ట‌ర్ గా కొత్త‌గా బాద్య‌త‌లు తీసుకున్న సూర్య‌కుమారీ..  అధికారుల‌తో స‌మావేశం కాక‌ముందే..నేరుగా మీడియా  సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా  బాధ్య‌త‌లు తీసుకున్న అనంతరం తొలిసారిగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఫోర్తె ఎస్టేట్ అయిన మీడియా అవ‌స‌రం చాలా ఉంద‌న్న‌ ఉద్దేశ్యంతో తొలిసారిగా మీతో మాట్లాడాల‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని  సూర్య‌కుమారీ అన్నారు.గుర‌జాడ న‌డియాడిన న‌గ‌రమ‌ని స్వ‌యంగా సీఎం జ‌గ‌నే…  విజ‌య‌న‌గ‌రం జిల్లా గురించి చెప్పార‌న్నారు.ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను అధ్య‌యనం చేసేందుకు వారం రోజుల్లో అధికారుల‌తో ప్ర‌త్యేక సమావేశం నిర్వ‌హిస్తాన‌న్నారు.

తాగు నీరు,వ్య‌వ‌సాయం, ఇసుక ,విత్త‌నాల వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు తెలుసుకున్నాన‌న్నారు.జిల్లాకు తాను రెండో మ‌హిళా క‌లెక్ట‌ర్ గా వ‌చ్చాన‌ని తొలుత పూనం మాలకొండ‌య్య  జిల్లా క‌లెక్ట‌ర్ గా బాద్య‌త‌లు నిర్వ‌హించార‌న్నారు.ఇక క‌రోనా  మ‌న‌ల్ని ఇంకా వ‌ద‌ల‌లేద‌ని…ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని..తాను వ‌స్తున్న‌ప్పుడు  చాలా మంది మాస్క్ లు పెట్టులేక‌పోవ‌డం చూసాన‌న్నారు..ఈ నేప‌ధ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ పెట్టుకోవాల‌ని తాను కూడా డ‌బుల్ మాస్క్ లు పెట్టుకున్నాన‌ని చెప్పారు.

వ్యాక్సినేష‌న్ కు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం టీకాలు వేయించుకోవాల‌ని కొత్త క‌లెక్ట‌ర్ సూచించారు. పాడి క‌ల్టివేష‌న్ లో స‌మ‌స్య‌లున్నాయ‌ని…. చాలా చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో వ‌చ్చాన‌న్నారు.స‌మ‌స్య‌లు ఏమైనా  ఉంటే క‌లెక్ట‌ర్ నెంబ‌ర్ కు వాట్స‌ప్ చేయొచ్చ‌ని..ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాల్ కన్న‌…మెసేజ్  ముఖ్య‌మ‌ని..ప‌నుల హాడావుడిలో కాల్ లిప్ట్ చేయ‌ని ప‌క్షంలో వాట్సాప్ చేయొచ్చ‌న్నారు.

ఉన్న వ‌న‌రుల‌తో ప‌ని చేయ‌డం చేయించాల‌న్న‌దే నా ఉద్దేశ్య‌మ‌ని అందుకు ఉదార‌హ‌ర‌ణే..బొకేలు ఇవ్వ‌కుండా పుస్త‌కాలు ఇవ్వాల‌ని సూచించాన‌న్నారు.ఇక స్వామి వివేకానంద చెప్పిన‌ట్టు  ఇనుప కండ‌రాలు ఉక్కు న‌రాలు క‌లిగిన యువ‌తే  దేశానికి ఆద‌ర్శ‌మ‌ని…యువ‌త‌ను జాగృతం చేయ‌డ‌మే నా ల‌క్ష్య‌మ‌ని వాళ్లే దేశానికి ప‌ట్టుకొమ్మ‌ల‌ని ఆ దిశగా ప‌ని చేస్తాన‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ చెప్పారు.

అంత‌కు ముందు కొత్త క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీకి జిల్లా స‌మాచారం,పౌర సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు డీ.ర‌మేష్..కొన్ని పుస్త‌కాల‌ను బ‌హుక‌రించి…త‌న‌ను పరిచ‌యం చేసుకున్నారు. క‌లెక్ట‌రేట్ కాన్ఫ‌రెన్స్ హాలులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో జే.సీ కిషోర్ కుమార్, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు,ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్, విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌,అసిస్టింటె క‌మీష‌న‌ర్  లు ఉన్నారు.

పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్న కొత్త క‌లెక్ట‌ర్..!

విజ‌య‌న‌గ‌రం  జిల్లాకు కొత్త క‌లెక్ట‌ర్ గా సూర్య‌కుమారిని రాష్ట్ర ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చిన సంగ‌తి విదిత‌మే. తొలుత సింహాచ‌లం దేవస్థానం లో సింహాద్రి అప్ప‌న్న‌ను ద‌ర్శించుకున్న ఐఏఎస్ సూర్య‌కుమారీ…నేరుగా  ఉద‌యం  ప‌దిన్న‌ర ప్రాంతంలో న‌గ‌రంలోని శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారిని భ‌ర్త‌తో క‌లిసి ద‌ర్శనం చేసుకున్నారు..ఉద‌యం 9.30 గంట‌ల‌కు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటార‌ని జిల్లా పౌర సంబందాల,స‌మాచార శాఖ స‌మాచారం ఇవ్వ‌డంతో…మీడియా అంతా..తొమ్మిది గంట‌ల‌కే దేవస్థానికి చేరుకుంది. కానీ గంట త‌ర్వాత  అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు   క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ వ‌చ్చారు. ఇక దేవస్థానం ఈఓ కిషోర్ కుమార్,ర‌మ‌ణ‌మూర్తి,శ్రీనివాస‌రావులు పూర్ణ‌కుంభంతో క‌లెక్ట‌ర్ ను స్వాగ‌తం ప‌లికి గ‌ర్భాల‌యంలోని తీసుకెళ్లారు.క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ అమ్మ‌వారికి ప‌సుపు కుంకుమ‌,ప‌ట్టుచీర‌,గాజులు అమ్మ‌వారకి స‌మ‌ర్పించారు. ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు…సూర్య‌కుమారీ దంప‌తుల‌కు వారి గోత్ర నామాల‌తో సంక‌ల్పం చెప్పి మరీ ప్ర‌త్యేక  పూజ‌లు చేసారు. అనంత‌రం  క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను ఆల‌య మండంప‌లో కూర్చొబెట్టి  ఆల‌య అర్చ‌కులు..వేద మంత్రోఛ్చార‌ణ‌ల‌తో ఆశీర్వ‌దించ‌గా..ఆల‌య ఈఓ కిషోర్ కుమార్..తీర్ధ ప్ర‌సాదాలు ఇచ్చారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్ విజయనగరం

Related posts

మైనర్ ల‌వ్…ఇంటి నుంచి వెళ్లిపోయిన తొమ్మిదో త‌ర‌గ‌తి బాలిక‌…!

Satyam NEWS

నాగమణి రాయి ఉంది కావాలా? కోటి రూపాయలు మాత్రమే

Satyam NEWS

నూతన సంవత్సరం సందర్భంగా గ్రామాలలో అశ్లీల నృత్యాలు

Satyam NEWS

Leave a Comment