35.2 C
Hyderabad
April 27, 2024 12: 46 PM
Slider విజయనగరం

దాదాపు 20 రోజుల త‌ర్వాత రెగ్యుల‌ర్ విధుల్లోకి విజయనగరం ఎస్పీ…!

#vijayanagarampolice

క‌రోనా…క‌రోనా…క‌రోనా ఎవ్వ‌రిని క‌దిపినా…ఏ హాస్ప‌ట‌ల్లో చూసినా…ఏ ఇద్ద‌రి మాట‌ల‌లోనైనా ఒకే మాట క‌రోనా. గ‌తేడాది యావ‌త్ ప్ర‌పంచాన్నే కుదేసిన‌ప్ప‌టికీ ఈ ఏడాది సెకండ్ వేవ్ పుణ్య‌మా…పెద్ద పెద్ద బ్యూరో క్రాట్సే…హోం ఐసోలేష‌న్ లో ఉంటూ  చికిత్స పొందుతున్నారు.

సీన్ క‌ట్ చేస్తే..దాదాపు 20 రోజులుగా  బంగ్లా నుంచీ ఆఫీసు ప‌నులు చూస్తున్న ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ… ఎట్ట‌కేల‌కు ఫీల్డులోకి అడుగు పెట్టారు. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో క‌రోనా పెరుగుతున్న వేళ‌…ప‌గ‌ల‌న‌న‌క‌,రాత్ర‌న‌న‌క నిద్రాహారాలు ప‌క్క‌న పెట్టిన త‌న సిబ్బంది చేత అహ‌ర్నిశ‌లు ప‌ని చేయించిన ఎస్పీ రాజ‌కుమారీ గ‌త‌నెల‌లో  నుంచీ  కేవ‌లం బంగ్లాకే ప‌రిమితం అయ్యారు.

అయితే అన్నీ సర్దుకోవ‌డంతో మ‌ళ్లీ క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల అటు ప్ర‌జ‌ల‌కు ఇటు శాఖా సిబ్బందికి తగు జాగ్ర‌త్త‌లు చెప్పే ప‌నిలో ప‌డ్డారు.ఇందులో భాగంగా జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో మ‌ధ్యాహ్నం..ఆక‌స్మాత్తుగా ప‌ర్య‌టించారు.

న‌గ‌రంలోని బాలాజీ  జంక్ష‌న్ ,గంట‌స్తంభం, క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి టెంపుల్ ప్ర‌దేశాల‌లోప‌ర్య‌టించారు.  అంతే కాకుండా ట్రాఫికె ఏఎస్ఐ గా ప‌ని చేస్తున్న ఈశ్వ‌ర‌మ్మ‌( జ్యోతి) భ‌ర్త కు క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్న‌ప్ప‌టికీ విధి నిర్వ‌హణ‌కే ఏఎస్ఐ జ్యోతి ప్రాధాన్య‌త ఇచ్చారు.

దీంతో ట్రాఫిక్ డీఎస్పీ ఆదేశించిన విధంగా న్యూపూర్ణా జంక్ష‌న్ లో  విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎస్పీ స‌రాస‌రి ఆమె విధులు నిర్వ‌హిస్తున్న ఘ‌ట‌నా స్థ‌లికి వెళ్లి పుష్ప‌గుచ్చం ఇచ్చి అభినందించారు.

కరోనా స‌మ‌యంలో అటు భర్త‌ను…ఇటు వృత్తిని నిర్వ‌హిస్తున్న ఏఎస్ఐ వృత్తి ధ‌ర్మాన్ని ఎస్పీ మెచ్చుకున్నారు.ఇక క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో 12 గంట‌ల‌కు పూర్త‌యినా..రోడ్ల మీద జ‌నాలు సంచ‌రించ‌డం చూసి విదులు నిర్వ‌హిస్తున్న త‌న శాఖా సిబ్బంది ద్వారా హెచ్చ‌రించారు.ఈ  ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లో విజ‌య‌న‌గర డీఎస్పీ అనిల్ , ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు,ఇత‌ర సిబ్బంది ఉన్నారు.

Related posts

గున్నాల వారి కళ్యాణమహోత్సవానికి వెళ్లిన కుసుమ

Satyam NEWS

తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

Bhavani

Leave a Comment