విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక…విజయనగరం డివిజన్… పూసపాటి రేగ పీఎస్ ను సందర్శించారు. స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ ను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో ఘర్షణలు జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాలు, వ్యక్తులను గుర్తించి, వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.
మంచి ప్రవర్తన కోసం ఎం.ఈ.ఎం. కోర్టుల్లో బాండులు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అనంతరం, పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ గారు మమేకమై, వారి సమస్యలను అడిగి తేసులుకొని, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ వార్షిక తనిఖీలు జరిగిన సమయంలో విజయనగరం ఇన్ ఛార్జ్ డిఎస్పీ టి.త్రినాథ్, భోగాపురం సిఐ విజయనాధ్, పూసపాటిరేగ ఎస్ఐ నరేష్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు.