ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థులు కావడంతో ఇన్ చార్జి బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి కే. విజయానంద్కు అప్పగించారు. విజయానంద్ ప్రస్తుతం విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. విజయానంద్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అస్వస్థతతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
previous post