37.2 C
Hyderabad
April 26, 2024 19: 59 PM
Slider ముఖ్యంశాలు

త్యాగాలు చేసిన విద్యార్ధుల శవాలపై పాలన

#Vijayashanthi

తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నాడని బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన విజయశాంతి నేడు హైదరాబాద్ లో బిజెపి కార్యాలయానికి వచ్చారు.

అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బు పదవుల మీద ప్రేమ ఎక్కువ అని ఆమె అన్నారు.

కేసీఆర్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని తన కుటుంబానికి పదవులు వచ్చేటట్టు చేసుకున్నాడని విజయశాంతి అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారు ఉండకూడదు అని ప్లాన్ చేసాడని కూడా ఆమె అన్నారు.

లక్ష రూపాయలు లేని కేసీఆర్ లక్షల కోట్లకు ఎలా వచ్చాడు అంటూ విజయశాంతి ప్రశ్నించారు.

కేసీఆర్ పెద్ద క్రిమినల్. కేసీఆర్ నాకంటే పెద్ద నటుడు అంటూ విజయశాంతి ఆరోపణలు చేశారు.

Related posts

108 దేశాలలో కనిపించిన మంకీ పాక్స్ వైరస్

Satyam NEWS

స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా మున్సిపల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తాం

Satyam NEWS

Vijayanagaram Police: 2 కోట్ల విలువైన 29 కార్లును స్వాధీనం

Satyam NEWS

Leave a Comment