భారతీయ జనతా పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి రాజకీయ జీవితం అందరికి ఆదర్శనీయమని కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. విజయశాంతి రాజకీయ ప్రయాణం నేటితో 25 సంవత్సరాలు పూర్తివడంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 25 కిలోల కేకును తీసుకెళ్లి కట్ చేయించి భారీ గజమాలతో విజయశాంతి కి శుభాకాంక్షలు తెలియచేశారు.
మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలుగా విజయశాంతి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఒక సినీ నటిగా, ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలుగా తన జీవితం లక్షలాది మంది ఆడపడుచులకు మరియు ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తన రాజకీయ ప్రయాణం నేటి యువతరానికి ఉండాల్సిన క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గ పాలక్ గా విజయశాంతి సహకారంతో భారతీయ జనతా పార్టీని కూకట్పల్లిలో అగ్రస్థనానికి తీసుకువెళ్లే నాయకుడిగా ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకురాలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.