భారత క్రికెట్లో కోహ్లీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తీరుతో మొదలైన వివాదం కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్, గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడి మధ్య బహిరంగ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కానీ దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి.. అని కపిల్ దేవ్ సూచించారు.