38.2 C
Hyderabad
April 29, 2024 13: 56 PM
Slider గుంటూరు

పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌

#money

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం లో లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంచకుండా డబ్బులు తీసుకుని ప్రియురాలు తో ఒక వాలంటీర్ పరారయ్యాడు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి వచ్చి కుమారుడు తీసుకెళ్లిన డబ్బును సచివాలయ సిబ్బందికి చెల్లించాడు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సర్దుబాటు కావడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ ను విధుల నుంచి తొలగింపు కు చర్యలు తీసుకుంటామని యంపిడిఓ తెలిపారు.

Related posts

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏం చేయాలి? నాగార్జున విసిని అడగండి

Satyam NEWS

హైదరాబాద్‌ కు చెందిన ప్రాక్టికల్లీ ఫ్రీ టీచర్ యాప్‌ ప్రారంభం

Satyam NEWS

కుంభోత్సవం సందర్భంగా 11న శ్రీశైలం ఆలయ వేళలలో మార్పు

Satyam NEWS

Leave a Comment