వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం లో లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంచకుండా డబ్బులు తీసుకుని ప్రియురాలు తో ఒక వాలంటీర్ పరారయ్యాడు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి వచ్చి కుమారుడు తీసుకెళ్లిన డబ్బును సచివాలయ సిబ్బందికి చెల్లించాడు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సర్దుబాటు కావడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ ను విధుల నుంచి తొలగింపు కు చర్యలు తీసుకుంటామని యంపిడిఓ తెలిపారు.