వ్యవసాయ పనిముట్లతో కుడిన మినీ ట్రాక్టర్ ను వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం పోలీస్ శాఖ కు వితరణ గా అందజేశారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ను కలసి అందజేశారు.
హరితహారంలో భాగంగా ఈ ఏడాది ఆగష్టు నెలలో ఖమ్మం కమిషనరేట్ కార్యాలయ అవరణలోని 10 ఎకరాల్లో సుమారు మూడు వేల పండ్ల మొక్కలను నాటారు. వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. రూ. లక్ష వెచ్చించి బిందు సేద్యం ద్వారా వాటికి నీరందిస్తున్నారు.
నాటిన వాటిలో అంజీర, జామ, పనస, మామిడి, ఉసిరి, నేరేడు, బత్తాయి, సీతాఫలం తదితర పండ్ల మొక్కలు నాటారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఆవరణలో బోరు, డ్రిప్ ఇరిగేషనికి ప్రత్యేక మోటార్ ఏర్పాటు చేశారు. వీటి సంరక్షణకు ఏర్పాటు చేశారు. ఇంకా వెయ్యి మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్ ద్వారా పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా వుండాలని చూడాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీలు అంజనేయులు, రామోజీ రమేష్ , భస్వారెడ్డి, సిఐలు పాల్గొన్నారు.