ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపాలిటీ ఎన్నికలలో గెలిచిన వైశ్య నేతలను ఆర్యవైశ్య సంఘం సన్మానించింది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సర్వసభ్య సమావేశం ఆదివారంనాడు దేవరపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది.
కోనా శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మునిసిపల్ కౌన్సిలర్లు, ద్వారకా తిరుమల ట్రస్టుబోర్డు సభ్యులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కోశాధికారి గాధంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ, జిల్లా ఆర్య వైశ్య ప్రధాన కార్యదర్శి నుదురుమాటి శ్రీరివాస్, తీగల బలరామయ్య, కొత్తగుండు బాబూరావు, కోనా హనుమాన్ బాబు, చలంచర్ల హరినాథ్, శ్రీకాకోళపు నరసింహారావు, సుతాపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.