నూతన సంవత్సరం 2021 ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
శుక్రవారం జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు మధుకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ చాంబర్లో కలిసి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ వనపర్తి జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది మరింత కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డి ఆర్డీవో కోదండరాములు,సీపీవో రవీందర్ రెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ అధికారి యుగంధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు మల్లికార్జున్,
డిపిఓ రాజేశ్వరి, వనపర్తి తాసిల్దార్ రాజేంద్ర గౌడ్ , ఏ ఎస్ ఓ హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి