రైతుకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాకుండా కష్ట సమయంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
వంగపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బైరాన్ పల్లి, మల్లారెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని సిద్దాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్నివేళలా అండగా నిలిచే అండగా నిలిచే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.
రైతులు ఆందోళన చెందవద్దని రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పే చిల్లర మాటలు నమ్మి రైతులు ఆగం కావద్దని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని అన్నారు. రైతు రాజుగా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.