ఆంధ్రప్రదేశ్ లో అరుదైన లొకేషన్ లు ఉండటమే కాకుండా ప్రభుత్వం షూటింగ్ చేసే నిర్మాతకు రాయితీలు ప్రకటించినట్లు మా ఏపి వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా, అధ్యక్షురాలు సినీ నటి కవిత తెలిపారు.
ఏపిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో జారీ చేసినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. తక్కువ వ్యయంతో సినిమాల షూటింగ్ లు జరుపుకోవచ్చునని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్రాలో షూటింగ్ లు చేసుకునే నిర్మాతలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల సబ్సిడీతో లొకేషనల్ లకు ఉచితంగా అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని ఆయన తెలిపారు.
కొండవీడు, భవానీ ద్వీపం, నిజాంపట్నం హార్బర్, వలస పక్షల కేంద్రాలు, పచ్చటి లంక గ్రామాలు, నదులు, జలాపాతాలు, అడవులు, ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో లొకేషన్లు ఏపిలో ఉన్నాయని ఆయన వివరించారు.
అలాగే ఆంధ్రాలో షూటింగ్ లు జరుపుకున్న సంస్థలు ఇక్కడే ఎడిటింగ్, డబ్బింగ్ లు చేసుకునే స్టూడియోలు ఉన్నాయని దిలీప్ రాజా తెలిపారు.
బడ్జెట్ పరంగా పోలిస్తే ఇతర ప్రాంతాల కన్నా 30 శాతం తక్కువ ఖర్చుకే అన్ని అందుబాటులో ఉంటాయని కవిత చెప్పారు. మా ఏపి ఆధ్వర్యంలోనే హాస్పిటల్, జైలు, కోర్టు లాంటి సెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఔత్సాహికులైన నిర్మాతలు తమ నిర్మాణ సంస్థ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు.