38.2 C
Hyderabad
April 28, 2024 21: 22 PM
Slider నెల్లూరు

నెల్లూరు నగర వీధులు ఎంపీ ఆదాలకు ఘన స్వాగతం

#MP Adala Prabhakar Reddy

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలో ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలను తీసుకొని నెల్లూరు నగరానికి మొదటిసారి విచ్చేసిన ఆదాలకు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే

విక్రమ్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, నెల్లూరు నగర వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్ , వైసీపీ సీనియర్ నేత ఆనం విజయకుమార్ రెడ్డి, వైవి రామిరెడ్డి, వైసిపి నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై నెల్లూరులో అట్టహాసంగా స్వాగతం పలికారు. బాణసంచా పేలుళ్లతో ర్యాలీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

నెల్లూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు జెండాలు చేతబూని ముందుకు సాగారు. స్వర్ణ జీవన్ ప్రసాద్ 20 అడుగుల గజమాలను క్రేన్ తో తెచ్చి ఎంపీ ఆదాలకు పుష్పాభిషేకం చేశారు. ఆదాల అభిమానులు పలు ప్రాంతాల నుంచి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బుజబుజ నెల్లూరు నుంచి పెన్నా బ్రిడ్జి వరకు రోడ్డు డివైడర్లలో ఇతర ప్రాంతాల్లోనూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇందులో సింహభాగం ఆదాల ప్రభాకర్ రెడ్డివి కాగా మిగతావి సీఎం జగన్, రాజ్యసభ సభ్యులు వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేల వి ఉన్నాయి. వివాద రహితుడు, సౌమ్యుడు అయిన ఆదాలకు నగర పౌరులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి అభివాదం చేశారు. నెల్లూరు నగర, రూరల్ యువ నేతలు తమ అనుచరులతో భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

అజాతశత్రువు అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ర్యాలీలో యువత అధిక సంఖ్యలో కలిసి నడవడం ఒక ప్రత్యేకతను సంతరించుకోంది. కరెంట్ ఆఫీస్ సెంటర్లో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య క్రేన్ సాయంతో భారీ గజమాలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సన్మానించారు.

అదే సెంటర్లో కార్పొరేటర్ అవినాష్ బ్యాండ్ మేళంతో స్వాగతం పలికి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వేదాయపాలెం సెంటర్లో మాజీ కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి, క్రేన్ సాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అలాగే ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బయ్య భారీ గజమాలతో తన అనుచరులతో ఎంపీ ఆదాలను సన్మానించారు.

ఫతేఖాన్పేట సెంటర్లో కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ ఎంపీ ఆదాలకు గజమాలతో సన్మానించారు. గద, పూల కిరీటాన్ని ధరింపజేశారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు భారీ గజమాలతో సత్కరించారు. వైసిపి నేత కమలాకర్ రెడ్డి వి.ఆర్.సి సెంటర్లో క్రేన్ సహాయం తో భారీ గజమాల ఎంపీ ఆదాలకు సమర్పించి గౌరవించారు.

Related posts

కేసు: పోలీసులపై దాడి చేసిన రేవంత్ రెడ్డి

Satyam NEWS

రైతులను హత్య చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

Satyam NEWS

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS

Leave a Comment