అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక లో ఆదివారం టీడీపీ నేత అద్దెపలి ప్రతాప్ రాజు కార్యాలయంలో రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యరి గంటానరహరిహరి మీడియా సమావేశం నిర్వహించారు.ఆయన వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చంగల్ రాయుడు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యరి గంటా నరహరి హరి మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
10 రోజుల ముందు పర్మిషన్ తీసుకున్నా కొత్త,చెత్త జీవోలతో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ కలవడంతో వై నాట్ టీడీపీ 175 పరిస్థితి అనే ఏర్పడిందని ఆయన అన్నారు.ఓట్లు వేసేది ప్రజలు, అధికారంలోకి వచ్చేది టీడీపీ, ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆయన వెంట రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, టీడీపీ నేతలు అద్దెపల్లె ప్రతాప్ రాజు,డాక్టర్ సుధాకర్, లక్ష్మీ నారాయణ, బషీర్, మందా శ్రీను,సుబ్రహ్మణ్యం నాయుడు, ఈడిమకల కుమార్.డి.ఆర్.యల్. మణి అనసూయమ్మ తది తరులు పాల్గొన్నారు