శ్రీదేవి కుమార్తె బాలివుడ్ నటి జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
అయితే జాన్వీ ఇంత వరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు.
మళ్లీ ఇప్పుడు తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూమీ మేకర్స్ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటింప చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రీ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించాలని జాన్వీని వారు కోరినట్లు తెలిసింది. అయితే ఆమె సమాధానం ఏమిటో వెల్లడి కాలేదు.