రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని, అందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్ ఆదేశాల మేరకు ఎర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.కేసీఅర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో గులాబీ నేతలు కృషి చేయలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, మూడోసారి గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్కి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రజక సంఘం రాష్ట్ర నాయకులు రెగళ్ళ కొండల అధ్వర్యంలో పలువురు మంత్రి పువ్వాడ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు.
బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు.