సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల యాతవాకిళ్ళ గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ నరసింహ రాజు అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న
మహిళా ఉద్యోగులు,ఏ.ఎన్.ఎం.లు సిస్టర్ చంద్రకళ,ఆశ,వినోద,అంగన్వాడి టీచర్లు సామ్రాజ్యం,సమాధానం, అంగన్వాడి ఆయాలు ఉమాభారతి సైదమ్మ,తదితరులు కెసిఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు.
అనంతరం పూలు,పండ్లు,శాలువా, స్వీట్లు,టిఫిన్ బాక్స్ ప్రజెంట్ చేసి వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాటాల జ్యోతి లింగరాజు యల్లావుల శ్రీదేవి నాగయ్య బైరి నాగయ్య కుక్కల రమణ సైదులు కొత్తూరు వెంకన్న,కుర్రి కాశయ్య,సంఘబంధం లీడర్ మేరీ, పంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్