ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండలంలో మాధవరం లో టీడీపీ ఎన్నారై నేత చలపాటి చంద్ర పై వైసీపీ నేతల దాడిని సోమవారం టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఖండించారు. చలపాటి చంద్ర ను పరామర్శించిన టీడీపీ చమర్ధి జగన్మోహన్ రాజు వర్గీయులు మాజీ ఈడిగ సంఘం డైరెక్టర్ కోమరా వెంకట నరసయ్య టీడీపీ శ్రేణులు కడప రిమ్స్ లో పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతపై 50 మంది దాడి చేయడం అమానుషం అన్నారు.పోలీసులకు చంద్ర ఫిర్యాదు చేస్తే,దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా, చంద్ర పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మాల్లిఖార్జున రెడ్డి ప్రోత్సాహాకం తోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.2024 లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.పోలీసు యంత్రాంగం కూడా ఆలోచించు కోవాలని విజ్ఞప్తి చేశారు.