తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేసిన ముగ్గురు వైసిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోండాం ఉమ, బుద్దా వెంకన్నలపై వైసిపి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని డ్రైవర్ సమయస్ఫూర్తితో బతికి బయటపడ్డ తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు తురగా కిషోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజులను అరెస్టు చేసినట్లు ఐజీ ప్రభాకరరావు తెలిపారు. ఈ ముగ్గురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో టీడీపీ నేతల వాహనంతో బాటు పోలీసు వాహనం కూడా ధ్వంసం అయింది.