రాజంపేట ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అన్నీ రాజకీయ పార్టీలు ,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
కడప జిల్లా రాజంపేట లో బుధవారం అన్నీ పార్టీల నాయకుల అధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధన కోసం అఖిల పక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో వైసీపీ, టీడీపీ,బీజేపీ,జనసేన,వామపక్ష పార్టీలు స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు.
అన్నీ వనరులు ఉన్న రాజంపేట ను బ్రిటిష్ వారు రెవెన్యూ డివిజన్ గా గుర్తించి అభివృద్ధి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కి రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై వక్తలు విచారణ వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రాజీనామా చేసి ఉద్యమం చేస్తే సహకరిస్తామని టీడీపీ నేతల వెల్లడించారు.
రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయక పోతే వైసీపీ కి చెందిన మర్రి రవి మునిసిపల్ వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అదేవిధంగా మరో వైసీపీ నేత స్టేట్ రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గండికోట గుల్జార్ బాషా, వైసీపీ మహిళ కార్యదర్శి మిరియాలు సురేఖ తమ పదవులకి రాజీనామా చేస్తామని వెల్లడించారు.
వైసీపీ నేతలు తమ పదవులకి రాజీనామా చేసి రాజంపేట జిల్లా సాధన కోసం పోరాటం చేయాలని వామపక్ష నేతలు కోరారు. అందరూ నాయకులు మాటలు కట్టిపెట్టి చేతల్లో రాజంపేట జిల్లా సాధించుకోవాలని అందుకు బార్ అసోసియేషన్ మద్దతు ఉంటుందని బార్ అసోసియేషన్ వారు సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు బీజేపీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటించారు.