28.7 C
Hyderabad
April 28, 2024 09: 19 AM
Slider గుంటూరు

వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లతో రైతుల దాడి

MLA car damaged

గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకు దిగారు. సచివాలయంలో సమావేశానికి వెళుతున్న సీఎం జగన్‌కు తమ నిరసన వ్యక్తం చేసిన అమరావతి ప్రాంత రైతులు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకు దిగారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకారులు బైఠాయించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు.

Related posts

త్వరలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన….!

Satyam NEWS

హోంగార్డ్స్ ఆదర్శంగా నిలవాలి

Murali Krishna

కత్తి లాంటి కొత్త కుర్రాడు మణి సాయి తేజ

Satyam NEWS

Leave a Comment