రానున్న 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయి నుండే వై సి పి ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ అధిష్టానం గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలలో వై సి పి యువ సాయుధ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నది. ఏడాది ముందు నుండే ఈ ఏర్పాట్లు చేస్తుండటంతో పార్టీ నాయకత్వ లోపాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మొత్తం పార్టీ వ్యవస్థకు బలం చేకూరుతుంది.
లోపాలపై పోస్ట్ మార్టం నిర్వహించి ఎదుటి వారిని మెప్పించి ఒప్పించి పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో మరింత బలోపేతం చేయగల సత్తా కలిగిన వై సి పి యువ ఆణిముత్యాల్లాంటి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసి నియమిస్తున్నారు. పార్టీ కోసం మెరుగైన, చురుకైన పాత్ర పోషించే యువ కెరటాలు ఎంపిక చేసి వారికి కన్వీనర్ పదవీ కిరీటాలను అందించింది. ఓటమి లేకుండా కోటలను బద్దలు కొట్టి ప్రతి పక్షం లేని సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆంధ్ర ప్రదేశ్ డైనమిక్ సి ఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వై సి పి యువకెరటాలను రంగం లోకి దింపింది.
ప్రతి పక్షాల ఉనికి యువ కెరటాల ప్రవాహానికి కొట్టుకు పోయేలా ఇప్పటి నుండే ఉవ్వెత్తున ఎగసి పడే వై సి పి యువ సైన్యాన్ని రాష్ట్రంలో తయారు చేసింది. రానున్న 2024 ఎన్నికలకు ముందే పార్టీలో యువ రక్తాన్ని నింపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలం పుంజుకునేందుకు వై సి పి అధిష్టానం వార్డు, సచివాలయ, మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ ల వ్యవస్థ తో క్షేత్ర స్థాయి నుండి వై సి పి గెలుపుకు బలమైన పునాదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
ఆయా నియోజక వర్గ కన్వీనర్ లుగా స్థానిక ఎం ఎల్ ఏ లే ఉంటూ వార్డు, గ్రామ, మండల, కన్వీనర్ ల నియామకాలను ఇప్పటికే చేపట్టి వై సి పి ఇప్పటికే ఒకడుగు ముందుకేసింది. కన్వీనర్ ల ఏర్పాటు నేపథ్యం లొనే ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో పెదవేగి, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాలకు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి కన్వీనర్ లను ఎంపిక చేసి
ప్రకటించారు. పెదవేగి మండల కన్వీనర్ గా యువకుడు ఉత్సాహవంతుడు, నిగర్వి నిరాడంబరుడు, ప్రజల సమస్యలపై మంచి అవగాహన కలిగిన వ్యక్తి, వంగూరు ముద్దుబిడ్డ కేసిన వంశ యువ కిశోరం అబ్బయ్య చౌదరి సైనికుల యువ దళపతి అయిన కేసిన సతీష్ ను దెందులూరు నియోజక వర్గం లో వై సి పి కి బలమైన పునాడులుగా ఉన్న మండలాలలో ఒకటైన పెదవేగి మండలానికి కన్వీనర్ గా ప్రకటించారు.
ప్రప్రథమంగా పొలిటికల్ లీడర్ గా నియోజక వర్గానికి అందించిన ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి కి వంగూరు వై సి పి కార్య కర్తలు, నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే దెందులూరు మండలానికి కట్టా ఏసుబాబు, ఏలూరు మండలానికి గుర్రం శివకుమార్, పెదపాడు మండలానికి అక్కినేని గోపిచంద్ లను కన్వీనర్ లు గా ప్రకటించడంతో నియోజక వర్గ0లో వై సి పి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి కొత్త రక్తం ఎక్కించడంతో నియోజక వర్గం లో వై సి పి నాయకత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది.