40.2 C
Hyderabad
April 28, 2024 18: 11 PM
Slider ముఖ్యంశాలు

రిషికొండ నిర్మాణాలపై వైసీపీ కప్పదాటు

#rushikonda

రిషికొండలో ఏం నిర్మిస్తున్నారు? నిర్మిస్తున్నది ప్రభుత్వమేనా? అన్నీ అనుమానాలే. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయడం మాట అటుంచి మరింత పెంచేలా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ఏదైనా ప్రభుత్వ నిర్మాణం జరుగుతుంటే ప్రజలు చూస్తామంటే చూపించాలి. అంతే కాని దాచి దాచి నిర్మాణాలు చేయడం ఏమిటి? ఈ ప్రశ్నల మధ్య రుషి కొండ నిర్మాణాలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా రుషి కొండ పై నిన్న అధికార వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇవి సెక్రటేరియేట్ భవనాలుగా పేర్కొంటు ఒక ట్విట్ చేశారు.

దాంతో అక్కడ ప్రభుత్వం సచీవాలయం నిర్మిస్తున్నట్లు వెల్లడి అయింది. రుషికొండపై సెక్రటేరియేట్ నిర్మిస్తున్నారన్న వార్త వైసీపీ ట్వీట్ తో దావానలంలా వ్యాపించింది. సచివాలయ నిర్మాణానికి మీకున్న అభ్యంతరాలేంటని నిన్న వైసీపీ ట్వీట్ చేసింది. ఒక్కరోజులోనే మాటమారుస్తూ పొరపాటున ట్వీట్ చేసినట్లు వెల్లడించింది.  రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణంపై ట్వీట్ లో పొరపాటున పేర్కొన్నట్లు వెల్లడించారు. ఒక్క సారిగా ఇది సంచలనం కలిగించింది. రుషికొండలో నిర్మాణాలపై మాటమారుస్తూ మరోసారి వైసీపీ ట్వీట్ చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు పరిగణించాలని వైసీపీ ట్వీట్ చేసింది. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నిన్నటి ట్వీట్ కనిపించ లేదు.

Related posts

భట్టి పాదయాత్రపై ఆరా తీసిన రాహుల్

Satyam NEWS

నా తెలుగు

Satyam NEWS

లింగాయత్ సమాజ్ నూతన కమిటీ అధ్యక్షుడు గా సంగాయప్ప

Satyam NEWS

Leave a Comment