38.2 C
Hyderabad
April 27, 2024 16: 51 PM
Slider కడప

వైసీపీ లో కష్ట పడిన వారికి గుర్తింపు….

#akepati

వైసీపీ లో కష్ట పడిన వారికి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకే పాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.

రాజంపేట మండలం బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో గురువారం నూతన రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మునక్కాయల సుమిత్ర ,వైస్ చైర్మన్ గా మునక్కాయల మురళీమోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆకే పాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ పోలి మురళి మోహన్ రెడ్డి  పార్టీ కష్ట కాలంలో కూడా పార్టీ అండగా నిలిచారని, పార్టీ గుర్తించి వారికి పదవి ఇవ్వడంతో అభినందనలు తెలిపారు.వైసీపీ పార్టీ లో కష్ట పడిన వారికి తగిన న్యాయం చేకూరుతుంది అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి,శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యల్లా రెడ్డి జిల్లా పరిషత్ మెంబర్ దాసరి ప్రశాంతి పెంచలయ్య పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాపై పోరాటానికి శ్రీచైతన్య విరాళం రూ.కోటి

Satyam NEWS

మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్

Bhavani

మిస్ ఫైర్: తలలోకి బెల్లెట్ దూసుకెళ్లి పోలీసు మృతి

Satyam NEWS

Leave a Comment