ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిరసన వ్యక్తం చేశారు.
నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే ఏలూరు లో వచ్చిన వింత వ్యాధి రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ త్రాగునీటి వనరులను ప్రక్షాళన కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డాక్టర్ చదలవాడ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ చూస్తే ఆకాశంలో.. ప్రజలు చూస్తే కలుషిత నీరులో ఉన్నారని ఆయన అన్నారు.