సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం అంకిరెడ్డి ఫౌండేషన్,సై యూత్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళాను స్థానిక శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి ప్రారంభించారు.
భారీగా పాల్గొన్న యువతీ, యువకులు,పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం అనంతరం శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ యువత ధైర్యంతో ముందడుగు వేస్తే సాధించ లేనిదంటూ ఏమీ లేదని,ఓటమి ఎప్పుడు కూడా గెలుపు పునాది అవుతుందని,ఓటమిని చూసి కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోకూడదని,రెట్టించిన ఉత్సాహంతో గెలుపు వైపు పరుగులు పెట్టాలని అన్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, కంపెనీల వద్దకు మనం వెళ్లడం కాదు కంపెనీలను హుజూర్ నగర్ నియోజకవర్గానికి రప్పించి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని,ఉద్యోగం అంటే ఏదైనా ఒకటేనని,అది ప్రభుత్వ ఉద్యోగం అయిన ప్రైవేట్ సెక్టార్ లో ఆయినా అని, హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా తన గెలుపుకి సహకరించిన యువత ఋణం తీర్చుకోవడానికి ఇంకా మరెన్నో జాబ్ మేళా ఏర్పాటు చేస్తానని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతోందని,సిఎం కెసిఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ఐడియాలజీ తో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతకు ఈ జాబ్ మేళాను విజయవంతం చేసిన అంకిరెడ్డి ఫౌండేషన్ సభ్యులకు,సై యూత్ సభ్యులకు,ప్రజా ప్రతినిధులకు,తెరాస పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్