28.7 C
Hyderabad
April 28, 2024 10: 29 AM
Slider ఆధ్యాత్మికం

సిరిమానును దర్శించిన జేడ్పీ చైర్మ‌న్ కుటుంబ సభ్యులు….!

విజయనగరం ఒంటితాటి ఆగ్రహారం (వి.టి.అగ్రహారం)లో శ్రీ పైడతల్లి అమ్మ వారు పండుగ సందర్భంగా ఊరు పెద్దలు ఆహ్వానం మేరకు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మజ్జి శ్రీనివాస‌రావు అమ్మవారిని దర్శించుకున్నారు. పైడితల్లి అమ్మవారిని విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) త‌న అర్ధాంగి పుష్పాంజలి, తన కుమార్తె సిరి సహస్ర, తన కొడుకు సాయి మోహిత్ లతో క‌లిసి సందర్శించుకున్నారు.

అమ్మవారి చదురు వద్ద, సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసారు. అంత‌కు ముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వి.టి.అగ్రహారం వాసులచే అమ్మవారిని దర్శించుకునేందుకు వి.టి.అగ్రహారం వెళ్లిన మజ్జి పుష్పాంజలికి స్థానిక పెద్దలు ఘణ స్వాగతం పలికారు.

తదనంతరం గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు పెద్ద వీధి కంది అప్పారావు, గణేష్ నగర్ వై. ఎస్సార్. సి. పి. కార్పొరేటర్ చందక శ్రీను, రెడ్డి వీధి తాట్రాజు కృష్ణ , రొంగళి వీధి మాజీ కౌన్సిలర్ రొంగళి రామారావు , ఎస్.సీ. కొలనీ గుర్రపు రవి ఇండ్లకు వెళ్ళి చీరలు, తాంబూలం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కంది అప్పారావు, మాజీ కౌన్సిలర్ రొంగళి రామారావు, కార్పొరేటర్ చందక శ్రీను, కంది రాజా, ఆలయ కమిటీ సభ్యులు , స్థానిక యువత పాల్గొన్నారు.

Related posts

పద్మశాలి సంఘం అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయ శంకుస్థాపన

Satyam NEWS

తండ్రి మరణించిన పది రోజులకే కొడుకు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment