27.7 C
Hyderabad
April 26, 2024 06: 53 AM
Slider శ్రీకాకుళం

అనుక్షణం సేవ చేస్తున్న పోలీసులకు, ఆశాలకు మజ్జిగ పంపిణి

butter milk

కరోనా వైరస్ నుండి  ప్రజలను కాపాడుతూ అనుక్షణం సేవ చేసే వారికీ  అండగా ఉందామని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లా తారకరామ,  మోక్షజ్ఞ సేవా సంఘం, మాదారపు యశోదమ్మ సేవాసమితి ఆధ్వర్యం లో  నగర ప్రజలకు  సేవలందిస్తున్న ట్రాఫిక్  పోలీసులకు, ANM,  ఆశా వర్కర్స్ కు నేడు ఆయన మజ్జిగ అందించారు.  

ప్రపంచవ్యాపితంగా వ్యాప్తి చెందుతున్న కరోనా   వైరస్  నిరోధించేందుకు శ్రమిస్తూ విశేష  సేవలందిస్తున్న వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో మండే  ఎండల్లో  పోలీస్ వారు  నిత్యం ప్రజారక్షణ  కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.

అలాగే డివిజన్ సచివాలయల పరిధి లో  ANM లు, ఆశా వర్కర్స్ ఈ విపత్కర సమయం లో  ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని ఆయన అన్నారు. నేడు సుమారు  200 మందికి మజ్జిగ అందించామని తెలిపారు. ఈ విధంగా లాక్ డౌన్ ఉన్న ఈ నెల 14 వరకూ మజ్జిగ అందిస్తామని ఆయన తెలిపారు.

Related posts

కంటైన్ మెంట్ జోన్ లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ పర్యటన

Satyam NEWS

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Satyam NEWS

షూటర్ ఇషా సింగ్ కు క్రీడా శాఖ మంత్రి అభినందన

Satyam NEWS

Leave a Comment