కరోనా వైరస్ విజృంభణ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ గడ్డు పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారు కేవలం రోజు వారీ సంపాదనపైనే ఆధారపడి ఉంటారని వారి కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఈ క్లిష్టపరిస్థితుల్లో తక్కువ ఆదాయం గల సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ వెల్లడించారు. కరోనా వైరస్ ను అందరం సమష్టిగా ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు.