ఏపీ.యన్.ఆర్.టి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి.హెచ్.ఇలియస్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ ప్రవాస ఆంధ్రుల కార్యాలయంలో ఆయన నేడు ప్రమాణ స్వీకారంచేశారు. బి హెచ్ ఇలియాస్ కడప పట్టణానికి చెందిన వారు. ఈ సందర్భంగా ఇలియాస్ ను రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్ బాబు, రాజంపేట పట్టణ వైసీపీ నేత పోలా శ్రీనివాస్ రెడ్డి ,కువైట్ వైసీపీ నేతలు బాలి రెడ్డి, మర్రి కళ్యాణ్, మేడపాటి వెంకట్ తదితరులు సన్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, రాష్ట్ర,జిల్లా వైసీపీ నేతలకి బి.హెచ్ .ఇలియజ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
previous post