తెలంగాణ జాగృతి కువైట్ శాఖ ఆధ్వర్యంలో కువైట్ లోని ఇండియన్ స్కూల్ లో బతుకమ్మ దీపావళి సంబురాలు ఘనంగా జరిగాయి. మహిళలంతా బతుకమ్మ ఆటలతో పాటలతో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. వచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ, సంబరాలను విజయవంతం చేశారు. వారి ఉత్సాహంతో కార్యక్రమం మరింత ఆనందోత్సాహాలతో సాగింది. రాబోయే రోజుల్లో మరెన్నో ఇటువంటి కార్యక్రమాలను తెలంగాణ బిడ్డలుగా కలిసికట్టుగా జరుపుకుందామని గల్ఫ్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు చిలం శెట్టి హరి ప్రసాద్, కువైట్ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చిలంశెట్టి హరిప్రసాద్, సినీ నటులు సంపూర్ణేష్ బాబు, జానపద గీత రచయిత, గాయకులు మాట్ల తిరుపతి, గాయని పారిజాత, కువైట్ లోని ప్రముఖ అరబిక్ సింగర్ ముబారక్ అల్ రషీద్, తెలంగాణ కువైట్ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, జిలకర మురళి రాయల్, స్థానిక అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
previous post