అనంతపురం జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటిలో ఘోరం జరిగింది. కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని చింపేసిన దారుణం ఇది. ఆర్ధిక సమస్యల కారణంగా ముగ్గురు ఆడపిల్లలను ఆ తల్లి చంపేసింది. ముగ్గురు పిల్లల్ని చింపేసిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోబోయింది.
పుట్టపర్తి మునిసిపాలిటిలోని పెద్ద కమ్మవారి పల్లి దొమ్మరి గుడిసెలో ఈ దారుణ సంఘటన జరిగింది. ముక్కు పచ్చలారని ముగ్గురు ఆడ పిల్లలు ఎనిమిదేళ్ల భవ్య, భార్గవి, ఏడేళ్ల చందన తల్లి చేసిన ఘాతుకంలో మరణించారు. వారిని ఆ తల్లి అక్కడి బావిలోకి తోసేసింది. తల్లి అరుణ ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే స్థానికులు తల్లిని కాపాడారు.