ఈసారైనా నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడుతుందా లేకా మరో మారు వాయిదా పడుతుందా అని నిర్భయ తల్లి అసహనం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు డెత్ వారంట్ జారీ చేయడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ “డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడోసారి కాబట్టి నేను చాలా సంతోషంగా లేను. మేము చాలా కష్టపడ్డాము, కాబట్టి చివరకు డెత్ వారెంట్ జారీ చేయబడిందని నేను సంతృప్తి చెందుతున్నాను. కనీసం మార్చి 3న అయిన వారికి (దోషులకి) ఉరిశిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
previous post