40.2 C
Hyderabad
April 26, 2024 12: 28 PM
Slider ఆదిలాబాద్

కరోనా ఎలర్ట్: పోలీసులూ అన్ని జాగ్రత్తలూ పాటించండి

nirmal sp 061

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కష్టపడుతున్న పోలీసులు విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్బీ ఫీల్డ్ సిబ్బందికి  ఎస్పీ శాని టైజర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ లాక్ డౌన్ ను అమలుచేసేందుకు ఎస్బీ ఫీల్డ్ సిబ్బంది పట్టణంలో  గ్రామమలలో తిరుగుతూ అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

అలాగే వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలని, ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్పీ సిసి వెంకట రమణ ఎస్బీ ఫీల్డ్ సిబ్బంది  పాల్గొన్నారు.

Related posts

రోజుకు 16 వేల మందికి ఫీడ్ మై హైదరాబాద్

Satyam NEWS

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవిన్యూ చట్టం

Sub Editor

ఎడ్వయిజ్: చౌకబారు విమర్శలు మానుకోండి

Satyam NEWS

Leave a Comment