రథసప్తమి పర్వదినం సందర్భంగా యాదగిరి థియేటర్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన శాంతి కళ్యాణంలో పాల్గొన్నారు.
రథసప్తమి పర్వదినం సందర్బంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామి వారికీ సూర్యప్రభ వాహనంపైన విద్య విమాన రధోత్సవం , స్వామి వారి ఊరేగింపు జరిపారు. అర్చనలు, శాంతి కళ్యాణం, అన్నదానం, సామూహిక లక్ష్మి సహస్ర నామ కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సామ రమణారెడ్డి మాట్లాడుతూ సూర్య భగవానుడు అందరికి అష్టైశ్వర్యాలు ఆయురోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జయంతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ పి.నర్సింగరావు పాల్గొన్నారు.
ఇంకా శంకర్ రెడ్డి, ప్రధాన అర్చకులు నల్లదిగ శ్రీనివాసాచార్యులు, అర్చకులు అనిల్ కుమార్ చార్యులు, రంగాచార్యులు, ఆనంద్ కుమార్, నాయకులు ముత్యాల సత్యనారాయణ, ఎర్రవెల్లి శివకుమార్ చారి, బెక్కం లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.