మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం వచ్చిన భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు పూర్తి అయింది. దేవస్థాన కల్యాణ మండపంలో ఈ హుండీ కానుకలను లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.3,97,80,828 ఆదాయం వచ్చిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామరావు తెలిపారు.
previous post