భారత దేశంలో అశాంతి నెలకుందా? లౌకిక రాజ్యంగా పిలువబడే ఇండియాలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అంటే అవును అంటుంది ఈ సర్వే. ‘వెరిక్స్ మ్యాపిల్క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ నిర్వహించిన ఒక సర్వే లో ఐక్యరాజ్యసమితి గుర్తించిన 195 దేశాల్లో 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకుని ఉన్నాయని తెలిపింది.
గతేడాది 47 దేశాల్లో మాత్రమే ఉన్న అశాంతి పరిస్థితులు ఈ ఏడాది 75 దేశాలకు విస్తరించగా అందులో భారత్ కూడా ఉంది. ఆయా దేశ ప్రభుత్వాలు మానవ హక్కులను హరించడమే ప్రజా పోరాటాలకు దారితీస్తుందని నివేదిక అభిప్రాయపడింది.