తిరుమల తిరుపతి దేవస్థానానికి కాసులు గలగలలాడుతున్నాయి. వేంకటేశ్వరుడికి హుండీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ.777.78 కోట్ల కానుకలు తిరుమల వేంకటేశుడికి అందాయి.
2018లో ఏడు నెలల కాలంలో రూ. 707.95 కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి రూ.69.82 కోట్లు ఎక్కువగా హుండీ ఆదాయం పెరిగింది. ఈ ఏడాది 7 నెలల కాలంలో 803 కిలోల బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 241 కిలోల బంగారం అధికంగా వచ్చింది.
ఇక వెండి కూడా ఈసారి 3,852 కిలోలు లభించగా, గత ఏడాది 1,859 కిలోలతో పోల్చితే1993 కిలోలు అధికంగా వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే 21.16 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.