28.7 C
Hyderabad
April 26, 2024 09: 04 AM
Slider ఆధ్యాత్మికం

ఆపద మొక్కులు: పెరిగిన తిరుమల వెంకన్న ఆదాయం

thDN73YIVR

తిరుమల తిరుపతి దేవస్థానానికి కాసులు గలగలలాడుతున్నాయి. వేంకటేశ్వరుడికి హుండీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే  గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏడు నెలల్లో  రూ.777.78 కోట్ల కానుకలు తిరుమల వేంకటేశుడికి అందాయి.

2018లో ఏడు నెలల కాలంలో రూ. 707.95 కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి  రూ.69.82 కోట్లు ఎక్కువగా హుండీ ఆదాయం పెరిగింది. ఈ ఏడాది 7 నెలల కాలంలో 803 కిలోల  బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 241 కిలోల బంగారం అధికంగా వచ్చింది.

ఇక వెండి కూడా ఈసారి  3,852 కిలోలు లభించగా, గత ఏడాది 1,859 కిలోలతో పోల్చితే1993 కిలోలు అధికంగా వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే 21.16 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.

Related posts

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS

పోలీస్ డైరీ: కమ్మచెట్టి అశోక్ లా మనం ఉండగలమా?

Satyam NEWS

Leave a Comment