26.7 C
Hyderabad
April 27, 2024 10: 15 AM
Slider నిజామాబాద్

కొనుగోలు కేంద్రంను పరిశీలించిన ఎమ్మెల్యే

hanmanth shinde

బిచ్కుంద మండలంలోని ఫథలాపూర్ గ్రామంలో కొనసాగుతున్న శనగ కొనుగోలు కేంద్రంను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే శనివారం పరిశీలించారు. కొనుగోలు తీరు రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి భయంకరమైనదని దాని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

కనపడని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ దూరం పాటించి ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. తప్పనిసరి అయితేనే గాని మాస్కులు ధరించి వచ్చి త్వరగా ఇంటికి వెళ్లిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ అరుణ్ కుమార్ సొసైటీ వైస్ చైర్మన్ యాదవరావు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

మెదక్ జిల్లా షీటీమ్ వాట్సప్ నెంబర్ 6303923823

Satyam NEWS

రాజకీయం చేయబోయిన కొమ్మినేనికి ఎదురుదెబ్బ

Bhavani

స్నేహ పూరితమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి

Satyam NEWS

Leave a Comment