కడప ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్రెడ్డి కోవిడ్ బారినపడి మృతి చెందటం బాధాకరమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వ్యవస్థలతో కలిసి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులకు వైరస్ సోకడం విచారకరమని ఆయన అన్నారు. జర్నలిస్టు మిత్రులంతా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని లోకేష్ తెలిపారు. మధుసూదన్రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేశారు.
రాజంపేటలోఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి నివాళి
కరోనా మహమ్మారి కష్ట సమయంలో నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ విలువైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు సకాలంలో చేరవేస్తూ, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై చివరికి తన ప్రాణాలను కూడా అర్పించిన ఎన్ టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి కరోనాతో చనిపోవడం చాలా బాధాకరమని రాజంపేటలోఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా మేడా మల్లిఖార్జున రెడ్డి తెలిపారు.
బిజెవైయం రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు సంతాపం
కోవిడ్19 తో తిరుపతి పద్మావతి ఆసుపత్రి లో యన్.టి.వి రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం యాబై లక్షల ఆర్థిక సహాయం అందించాలని బిజెవైయం రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాధ రెడ్డి,రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు,టి.యన్.యస్. ఎఫ్.జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు.