తన సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం లేని సిఎం జగన్మోహన్ రెడ్డి వర్క్ షాపు పెట్టుకున్నారని టీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో నేడు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎక్కడ పారిపోతారోనని సీఎం భయపడుతున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలంతా జగన్ననే మన రాష్ట్రానికి అంధకారం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సిఎం జగన్మోహన్ నాలుగు సంవత్సరాలో 7నార లక్ష కోట్ల అప్పులు చేసి కూడా ఒకటవ తేది జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి బయటకు రాలేక ఉన్నారు.
నిన్న 6వేల 500 కోట్ల రూపాయలతో ఆసరా అనే కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారభినించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఆసరా పథకం అందని పరిస్థితి…అని ఆయన విమర్శించారు. ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారనీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అత్తారింటికి కొత్త అల్లుడు వచ్చినట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారనీ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారో చెప్పాలి… ఏప్రిల్ 1 తేది శుభమా అని కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైతే సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పులతో మొదలు పెట్టారు… ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి తీసుకొని పోవడమే సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భవిష్యత్తు….అని ఆయన విమర్శించారు.