నలుగురు మృతి కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉండడంతో వారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరంతా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post