ప్రముఖ సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన డాక్టర్లు యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ప్రభు కిడ్నీలోని రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
previous post