40.2 C
Hyderabad
April 26, 2024 11: 46 AM
Slider ముఖ్యంశాలు

కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి

#muluguBJP

దేశంలో ఒకవేళ కరోనా  థర్డ్ వే విజృంభిస్తే  దాన్ని ఎదుర్కోవడానికి భాజపా కార్యకర్తలు బూత్ స్థాయి నుండి మొదలుకొని జాతీయ స్థాయి స్వచ్ఛందంగా ముందుకు రావాలని భాజపా రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రొఫెసర్ విజయ్ చందర్ రెడ్డి అన్నారు.బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, హెల్త్ వాలంటీర్స్ జిల్లా కోర్డినేటర్ నగరపు రమేష్  ఆధ్వర్యంలో  ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో  స్వస్థ్య స్వయంసేవక్ అభియాన్ (హెల్త్ వాలంటీర్ల వర్క్ షాప్) నిర్వహించారు.

ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ మాధవి,డాక్టర్ శిల్ప, పాల్గొని హెల్త్ వాలంటీర్స్ కి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రొఫెసర్ విజయ్ చందర్ రెడ్డి  మాట్లాడుతూ భవిష్యత్తులో ఒకవేళ థార్డ్ వేవ్ విజృంభిస్తే  దానిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వమే కాకుండా,  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్తులైన భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు బూత్ స్థాయి నుండి మొదలుకొని జాతీయ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గతంలో మాదిరిగానే, భవిష్యత్తులో కూడా  కరోనా మహమ్మారి ని నివారించడానికి నడుము కట్టే విధంగా  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు  .

దేశం కోసం దేశ ప్రజల కోసం సేవచేసే అవకాశాన్ని ప్రతి ఒక బిజెపి కార్యకర్త బాధ్యతగా స్వీకరించాలని, మన గ్రామంలో ప్రజలు  కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎవరైనా కరోనా బారిన పడితే వారిలో మనోధైర్యాన్ని నింపి తగు సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు, మన చుట్టూ ఉండే జనాలు ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చూడాలని, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితి నుండి కోలుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు

ఈ కార్యక్రమంలో బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినకల కృష్ణకర్ రావు,ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాయికంటి పరమేశ్వర్, అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి,జిల్లా ప్రచార కార్యదర్శి దొంతిరెడ్డి రవి రెడ్డి  మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్,భూక్య జవహర్ నాయక్  పాల్గొన్నారు.

Related posts

పిల్లలతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

ఆసక్తి రేపుతున్న కొత్త జంట

Satyam NEWS

బాలయ్య, చిరంజీవి చిత్రాల టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి

Satyam NEWS

Leave a Comment