మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ న్యాయవాది ఒకరు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు నేడు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.
క్రైమ్ నెం: 144/2021 లో, సెక్షన్లు153-A, 295-A, 298 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసిన కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.