సాంప్రదాయ రీతిలో వచ్చె బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు. శనివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ సంబురాలు జరిగాయి. ఐ డి ఓ సి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు కిషోర బాలికలు, మహిళా ఉద్యోగులతో బొడ్డెమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ కిశోర బాలికల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు మంచి పోషకాహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రక్తహీనతను ఎదుర్కోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన కిషోర బాలికలు హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో కృష్ణ చైతన్య డిడబ్ల్యుసి చైర్మన్ అలివేలమ్మ, డిసి పిఒ రాంబాబు, డీఈవో రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కిశోర బాలికలకు నాప్కిన్స్ అందజేశారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్