40.2 C
Hyderabad
April 28, 2024 18: 43 PM
Slider మహబూబ్ నగర్

బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి

#yashminbhasha

సాంప్రదాయ రీతిలో వచ్చె బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు. శనివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ సంబురాలు జరిగాయి. ఐ డి ఓ సి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు కిషోర బాలికలు, మహిళా ఉద్యోగులతో బొడ్డెమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ కిశోర బాలికల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు మంచి పోషకాహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రక్తహీనతను ఎదుర్కోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన కిషోర బాలికలు హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి  ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో కృష్ణ చైతన్య డిడబ్ల్యుసి చైర్మన్ అలివేలమ్మ, డిసి పిఒ రాంబాబు, డీఈవో రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కిశోర బాలికలకు నాప్కిన్స్ అందజేశారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సీఎం జగన్ రాజీనామా చేయాలి

Satyam NEWS

జలాశయాల వద్దకు ఎవరూ రాకుండా చర్యలు

Bhavani

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

Murali Krishna

Leave a Comment