సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి ని పి.సి.సి ప్రతినిధిగా నియమించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని రోజ్ గార్డెన్స్ లో పి.సి.సి డెలిగేట్ ల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పి.సి.సి ప్రతినిధిగా ప్రత్యేక కోటాలో ఢిల్లీ నుండి తనను నియమించినట్లు అల్లం ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.అల్లం ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా,పి.సి.సి అధికార ప్రతినిధిగా పని చేశారు.అల్లం ప్రభాకర్ రెడ్డి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.తన నియమాకానికి సహకరించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,మాజీ పి.సి.సి అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఏఐసీసీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అనిల్ థామస్,పి.ఆర్.ఓ ఉన్ని కృష్ణన్ లకు అల్లం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్