38.2 C
Hyderabad
April 29, 2024 20: 34 PM
Slider విశాఖపట్నం

అమరావతి రైతులు పాదయాత్ర ఒక్కటే టీడీపీ కి ఆశ

#kolagatla

మినుకుమినుకు మంటున్న‌  టీడీపీకి..ఒక్క అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్రే ఓ ఆశ అని డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ‌రావ‌తి రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు మొద‌ట్లో చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌లికి ఆందోళ‌న చేసిన త‌ర్వాత వ‌చ్చిన లోక‌ల్  ఎల‌క్ష‌న్ల‌లో అధికార  వైఎస్ఆర్సీపీకి ప్ర‌జ‌లు మ‌ద్దుతు ఇచ్చి…త‌మ పార్టీ అభ్య‌ర్దుల‌న‌నే గెలిపించార‌న్నవిష‌యం టీడీపీ  మ‌ర్చిపోయిన‌ట్లుంద‌ని..డిప్యూటీ స్పీక‌ర్ అన్నారు.

గుంటూరు జిల్లాలో  అటు స్థానిక  ఎన్నిక‌ల‌లోనూ ఇటు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌లోనూ వైఎస్ఆర్సీపీ  అత్య‌ధిక  సీట్లు గెలుచుకుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్  గుర్తు చేసారు. రాయ‌ల‌సీమ వెళ్లారు…అక్క‌డి ప్ర‌జ‌లు త‌రిమి కొట్టారు..అక్క‌డ నుంచీ…ఉత్త‌రాంధ్ర  వైపు  దృష్టి పెట్టి…ఇక్క‌డ‌కు  వ‌స్తున్నారు…చాల‌లా ఏళ్లుగా ఉత్త‌ర‌రాంధ్ర వెన‌క‌బ‌డిన ప్రాంతంగా ఉన్న త‌రుణంలో విశాఖ ..ప‌రిపాల‌న రాజ‌దానిగా వ‌స్తే….దాన్ని అడ్డుకోవ‌డానికి…టీడీపీ త‌న ఆఖ‌రి అస్త్రంగా అమ‌రావ‌తి రైతుల పాదయాత్ర‌తో..విశాఖ  ను ప‌రిపాల‌న రాజ‌దానిగా కాకుండా అడ్డుకోవ‌డం ప‌ద్ద‌తిగా లేద‌న్నారు. అంందు కోస‌మే వికేంద్రీక‌ర‌ణ‌కు  మ‌ద్దతుగా ఈ నెల  15న విశాఖ  లోని  ఎల్ఐసీ  బిల్డింంగ్  వ‌ద్ద  విజ‌య‌న‌గ‌రం నుంచీ దాదాపు 15 వేల  మంంది జేఏసీ త‌ల‌పెట్టిన దీక్ష‌కు వెళుతున్నామ‌న్నారు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.

Related posts

సినిమా హీరోగా మారుతున్న నిజ జీవితం హీరో

Satyam NEWS

కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తా

Satyam NEWS

రామంతాపూర్ డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన

Satyam NEWS

Leave a Comment