సీఏఏ వల్ల ఏ ఒక్కరూ పౌరసత్వాన్ని కోల్పోరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాంటి నిబంధన ఏదైనా చట్టంలో ఉంటే చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ ఆయన విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప వారు చేసే వాదనలో ఎలాంటి పస లేదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిరసనకారులకు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాల వైఖరిని తప్పుబట్టారు.